తెలంగాణ

telangana

ETV Bharat / state

చెట్లను పెంచాలి... పర్యావరణాన్ని రక్షించాలి - enviranment

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. లక్ష్మణ్ అన్నారు. న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మంలో పర్యావరణ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు.

న్యాయమూర్తి, కలెక్టర్​

By

Published : Jun 6, 2019, 4:00 PM IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పుస్కరించుకుని ఖమ్మంలో ర్యాలీ తీశారు. కోర్టు ఆవరణ నుంచి ఇల్లెందు కూడలి వరకు సాగిన ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. లక్ష్మణ్​, కలెక్టర్​ ఆర్​వీ కర్ణన్​తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని జడ్జీ ఎం. లక్ష్మణ్ అన్నారు. మొక్కలు నాటడం ద్వారా ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చని కలెక్టర్ ఆర్​వీ కర్ణన్ తెలిపారు. ర్యాలీలో అదనపు డీసీపీ మురళీధర్, న్యాయమూర్తులు, న్యాయవాదులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

చెట్లను పెంచాలి... పర్యావరణాన్ని రక్షించాలి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details