కరీంనగర్ జిల్లా హన్మాజిపల్లిలో స్థానిక పోలీసులు, బీఎస్ఎఫ్ బలగాలు కవాతు నిర్వహించాయి. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
By
Published : Mar 31, 2019, 4:15 PM IST
ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలి
ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలి
లోక్సభ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం హన్మాజిపల్లిలో పోలీసులు కవాతు నిర్వహించారు. సరిహద్దు భద్రతాదళం సభ్యులు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.ఇవీ చూడండి:'నా రాజీనామాతోనైనా కనువిప్పు కలగాలి'