తెలంగాణ

telangana

By

Published : Oct 26, 2019, 7:06 PM IST

ETV Bharat / state

'రాష్ట్రం కూడా అప్పుల్లో ఉంది... రాజీనామా చేస్తారా?'

ముఖ్యమంత్రి కేసీఆర్​పై కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అప్పుల పాలు చేసినందుకు రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

'రాష్ట్రం కూడా అప్పుల్లో ఉంది... రాజీనామా చేస్తారా?'

అప్పుల్లో ఉన్న ఆర్టీసీని మూసేస్తానని సీఎం అన్నారని... మరీ రాష్ట్రం కూడా అప్పుల్లో ఉందని... అందుకు బాధ్యతగా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లో గాంధీ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విషయంపై రాష్ట్ర గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై విచారణ జరపాలని కోరారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ముఖ్యమంత్రిని, తెరాస పార్టీని ఏం చేయాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మీకులను, రాజకీయ పార్టీలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని... రైతులను ఆదుకుంటారా లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.

'రాష్ట్రం కూడా అప్పుల్లో ఉంది... రాజీనామా చేస్తారా?'

ABOUT THE AUTHOR

...view details