తెలంగాణ

telangana

kaleshwaram: గాయత్రి పంప్‌హౌజ్​ వద్ద గోదారమ్మ పరవళ్లు

By

Published : Jun 17, 2021, 10:05 AM IST

Updated : Jun 17, 2021, 10:33 AM IST

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల ఎత్తిపోత ప్రక్రియ మొదలైంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌజ్​ నుంచి రెండు బాహుబలి పంపులతో 6 వేల క్యూసెక్కుల జలాలను మధ్యమానేరు ప్రాజెక్టుకు తరలిస్తున్నారు.

Kaneswaran waters rise from Gayatri pump house
గాయత్రి పంప్‌హౌస్ నుంచి కాళేశ్వరం జలాలు ఎత్తపోత

మధ్యమానేరు ప్రాజెక్టు నిల్వ జలాలు ప్రస్తుతం కనిష్ఠ స్థాయికి చేరడంతో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు మొదలు పెట్టారు. ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌ గాయత్రి పంప్ హౌజ్​ నుంచి మొదటి, మూడో బాహుబలి పంపుల ద్వారా దాదాపు 6వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.

గాయత్రి పంప్‌హౌస్ నుంచి కాళేశ్వరం జలాలు ఎత్తపోత

ఎత్తిపోతల జలాలను గాయత్రి పంప్‌హౌజ్​ నుంచి ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ద్వారా మధ్యమానేరు ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. ఈ ఎత్తిపోతలతో మధ్యమానేరు జలాశయం నీటి నిల్వ పెరిగి జలకళను సంతరించుకోనుంది.

ఇదీ చదవండి: Lock down: ఈ నెల 20 తర్వాత లాక్​డౌన్​ ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం

Last Updated : Jun 17, 2021, 10:33 AM IST

ABOUT THE AUTHOR

...view details