తెలంగాణ

telangana

ETV Bharat / state

'వైభవంగా శ్రీవారి వైకుంఠ ద్వార వేడుకలు'

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ మహా విష్ణు ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని పలు ఆలయాల్లో ఘనంగా సంబురాలు నిర్వహించారు.

By

Published : Jan 6, 2020, 6:22 PM IST

ఉత్తర ద్వారం దర్శనం ఇచ్చిన శ్రీవారు
ఉత్తర ద్వారం దర్శనం ఇచ్చిన శ్రీవారు

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలో ఇల్లందకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఉత్సవ మూర్తులను సింహావాహనంపై ఊరేగించారు. భక్తుల గోవింద నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు జమ్మికుంటలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ఉత్తర ద్వారం దర్శనం ఇచ్చిన శ్రీవారు

ఇవీ చూడండి : ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details