ETV Bharat / state

ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో ఆధ్మాత్మిక శోభ సంతరించుకుంది. నగరంలోని ఆలయాలకు భక్తులు బారులు తీరారు. చిక్కడపల్లిలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

author img

By

Published : Jan 6, 2020, 5:02 PM IST

Hare Krishna Ykunta Ekadashi Celebrations in chikkadpally
హైదరాబాద్​లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

ఇవాళ వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని హైదరాబాద్​లో తెల్లవారుజామునుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. రంగురంగుల విద్యుద్దీపాలతో, విభిన్న రకాల పూలతో ఆకర్షణీయంగా సుందరీకరించారు. స్వామిని దర్శించుకోవడానికి గంటల తరబడి క్యూలైన్​లో నిలబడి వైకుంఠ ద్వారం ద్వారా వెళ్లి దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో సామూహిక తులసి అర్చనలు నిర్వహించారు.

చిక్కడపల్లిలోని వేంకటేశ్వర ఆలయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్ 12లోని స్వయంంభు శ్రీ లక్ష్మీనరసింహాస్వామి దేవాలయంలో రాత్రికి కీర్తనలు, 108 జంటలతో కలశపూజ నిర్వహించనున్నట్లు ఆలయ పూజరులు తెలిపారు. ఇందులో ఏపీఈఆర్‌సీ ఛైర్మన్ న్యాయమూర్తి సీవీ నాగార్జున రెడ్డి, తెలంగాణ మహిళా శిశుసంక్షేమ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్‌, ఏఐసీసీ కార్యదర్శి ఆర్‌సీ కుంతియా, టీఎంసీ ఛైర్మన్ నంగునూరి చంద్రశేఖర్, స్థానిక కార్పోరేటర్ గద్వాల విజయలక్ష్మీ తదితరులు పాల్గోనున్నారు.

హైదరాబాద్​లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

ఇవీ చూడండి: శ్రీవారి సన్నిధిలో 'మన' మంత్రులు..

ఇవాళ వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని హైదరాబాద్​లో తెల్లవారుజామునుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. రంగురంగుల విద్యుద్దీపాలతో, విభిన్న రకాల పూలతో ఆకర్షణీయంగా సుందరీకరించారు. స్వామిని దర్శించుకోవడానికి గంటల తరబడి క్యూలైన్​లో నిలబడి వైకుంఠ ద్వారం ద్వారా వెళ్లి దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో సామూహిక తులసి అర్చనలు నిర్వహించారు.

చిక్కడపల్లిలోని వేంకటేశ్వర ఆలయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్ 12లోని స్వయంంభు శ్రీ లక్ష్మీనరసింహాస్వామి దేవాలయంలో రాత్రికి కీర్తనలు, 108 జంటలతో కలశపూజ నిర్వహించనున్నట్లు ఆలయ పూజరులు తెలిపారు. ఇందులో ఏపీఈఆర్‌సీ ఛైర్మన్ న్యాయమూర్తి సీవీ నాగార్జున రెడ్డి, తెలంగాణ మహిళా శిశుసంక్షేమ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్‌, ఏఐసీసీ కార్యదర్శి ఆర్‌సీ కుంతియా, టీఎంసీ ఛైర్మన్ నంగునూరి చంద్రశేఖర్, స్థానిక కార్పోరేటర్ గద్వాల విజయలక్ష్మీ తదితరులు పాల్గోనున్నారు.

హైదరాబాద్​లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

ఇవీ చూడండి: శ్రీవారి సన్నిధిలో 'మన' మంత్రులు..

TG_HYD_26_06_HARE_KRISHNA_YKUNTA_EKADASHI_PUJALU_AB_TS10007 Contributor: Vijay Kumar Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో ఆధ్మాత్మిక శోభ సంతరించుకుంది. నగరంలోని ఆలయాలకు భక్తిశ్రద్దలతో భక్తులు బారులు తీరారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్ 12లోని స్వయంంభు శ్రీ లక్ష్మీనరసింహాస్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వారం నుంచి భక్తులు భగవద్దర్శనం చేసుకున్నారని హరేకృష్ణ మూవ్‌మెంట్‌, అక్షయపాత్ర ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ అధ్యక్షుడు శ్రీమాన్ సత్యగౌరచంద్రదాస తెలిపారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి కీర్తనలు, ద్విత్రిమ్శతి సహస్ర అంటే 32వేల సార్లు హరినామ స్మరణ నామార్చనతో పాటు 108జంటలతో కలశపూజ నిర్వహించనున్నామని శ్రీమాన్ సత్యగౌరచంద్రదాస పేర్కొన్నారు. ఆలయం పూజా కార్యక్రమంలో ఏపీఈఆర్‌సీ ఛైర్మన్ న్యాయమూర్తి సీవీ నాగార్జున రెడ్డి, తెలంగాణ మహిళా శిశుసంక్షేమ ప్రధాన కార్యదర్శి జగధీశ్వర్‌, ఏఐసీసీ కార్యదర్శి ఆర్‌సీ కుంతియా, టీఎంసీ ఛైర్మన్ నంగునూరి చంద్రశేఖర్, స్థానిక కార్పోరేటర్ గద్వాల విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. బైట్: నాగార్జున రెడ్డి, ఏపీఈఆర్‌సీ ఛైర్మన్ బైట్: శ్రీమాన్ సత్య గౌరచంద్ర దాస, హరేకృష్ణ మూవ్‌ మెంట్ అక్షయపాత్ర ప్రాంతీయ అధ్యక్షుడు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.