తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డెక్కిన రైతు

ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడం లేదని రోడ్డెక్కారు రైతన్నలు. కరీంనగర్​ జిల్లా గంగాధరా క్రాసింగ్​ వద్ద తెదేపా, కాంగ్రెస్​ల ఆధ్వర్యంలో జరిగిన రాస్తారోకోతో పెద్ద ఎత్తున ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

By

Published : Feb 25, 2019, 6:32 PM IST

Updated : Feb 25, 2019, 7:28 PM IST

రోడ్డెక్కిన రైతు

రోడ్డెక్కిన రైతు
కరీంనగర్ జిల్లా గంగాధరా క్రాస్ రోడ్డు వద్ద రైతులు సాగునీటి కోసం ఆందోళన చేపట్టారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరున్నప్పటికీ తమ పంటలకు నీరు రావడం లేదని గత వారం రోజులుగా అన్నదాతలు ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎల్లంపల్లి నుంచి గంగాధరా వరకు రైతు యాత్ర చేపట్టారు. సాగు నీటి కోసం నిరసన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాస్తారోకో చేశారు.

ట్రాఫిక్​ జాం...

ఈ నిరసనతో జగిత్యాల, కరీంనగర్ రహదారిలో వాహనదారులకు పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడింది. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో వాగ్వాదం చోటు చేసుకుంది. భారీగా పోలీసులను మోహరించి ఆందోళనకారులనుఅదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం వెంటనే సాగునీటి సమస్యలు పరిష్కరించకపోతే నిరసననుమరింత ఉద్ధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

ఇవీచదవండి:అసెంబ్లీ నిరవధిక వాయిదా

Last Updated : Feb 25, 2019, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details