తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఓటు వేద్దాం మన బాధ్యత నిర్వహిద్దాం'

జగిత్యాల పట్టణంలో ఎక్కడ చూసినా గోడ ప్రతులు, కరపత్రాలే. ఏంటీ ప్రచార సమయం ముగిసినా ఎవరీ ప్రచారం చేసేది, ఏ పార్టీకి సంబంధించిన వారు అనుకుంటున్నారా! ఓటు వేద్దాం... మన బాధ్యత నిర్వహిద్దామంటూ జిల్లా కలెక్టరే ప్రచారం నిర్వహిస్తున్నారు.

By

Published : Apr 10, 2019, 5:08 PM IST

'ఓటు వేద్దాం మన బాధ్యత నిర్వహిద్దాం'

రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లాలో కలెక్టర్ శరత్ ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద, దుకాణాలు, రోడ్లకిరువైపులా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ఓటు హక్కు కల్గిన వారందరూ ఓటును వినియోగించుకోవాలని, ఎలా వినియోగించుకోవాలో సూచించే పద్ధతిని ఆ ఫ్లెక్సీలో పొందుపరిచారు.

ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కలెక్టర్ తీసుకొచ్చిన వినూత్న పద్ధతులు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయని పట్టణవాసులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ కంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా నయోదయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఫ్లెక్సీలు ఉండటంతో ఓటర్లు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సారి నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో అత్యధికంగా పోటీదారులు ఉండడం వల్ల మొన్నటివరకు ఓటర్లు ఓటు వేసే విధానం తెలియక ఆందోళనకు గురయ్యారని ప్రజలు చెబుతున్నారు. కానీ కలెక్టర్ వాట్సాప్, ఫేస్​బుక్​లతో పాటు కరపత్రాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో... ప్రజలకు ఓటు వేసే విధానం సులభంగా తెలిసిందన్నారు.

చదువుకోని వారికి కూడా అర్థమయ్యేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఓటు హక్కుపై అవగాహన కల్పించడం హర్షణీయమని స్థానికులు చెబుతున్నారు.

'ఓటు వేద్దాం మన బాధ్యత నిర్వహిద్దాం'

ఇవీ చదవండి: సీఎం కేసీఆర్​కు ఎన్నికల సంఘం నోటీసులు

ABOUT THE AUTHOR

...view details