తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోండి'

కరీంనగర్ నియోజకవర్గంలో ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు.

By

Published : Apr 11, 2019, 11:58 AM IST

ఓటు వేసిన కమలాసన్ రెడ్డి

కరీంనగర్​ నగరపాలక సంస్థలోని పోలింగ్ కేంద్రంలో పోలీస్​ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటును నిర్భయంగా వేసేందుకు ముందుకు రావాలని సూచించారు. మంచి ప్రజాస్వామ్యం కావాలంటే 100% ఓటింగ్​లో పాల్గొనాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఓటు వేసిన కమలాసన్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details