కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చెందిన రేణుక దంపతులు కొద్ది రోజుల కింద మృతి చెందారు. వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఐదో తరగతి, మూడో తరగతి చదువుతున్న ఆ చిన్నారులకు శాతవాహన క్లబ్ జిల్లా అధ్యక్షుడు వడకాపురం జగదీశ్వర చారి రూ. 10వేల నగదుతో పాటు పుస్తకాలను అందించారు. భవిష్యత్తులో పై చదువుల కోసం తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గణపతి పూజ అనంతరం వినాయకుని సన్నిధిలో చిన్నారులకు నగదును అందించారు.
అనాథలకు చేయూత.. రూ.10వేల అందజేత..
చాలా మంది కోట్లు సంపాదిస్తుంటారు. కానీ కొంత మంది మాత్రమే పెద్ద మనసు ఉంటుంది. పది మందికి సాయపడే గుణం ఉంటుంది. అలానే ఇద్దరు అనాథ చిన్నారలకు రూ.10వేల ఆర్థిక సాయం చేశారు కరీంనగర్లోని వడకాపురం జగదీశ్వర చారి.
పిల్లలకు నగదు అందజేస్తున్న జగదీశ్వర్