తెలంగాణ

telangana

ETV Bharat / state

'భజరంగ్​దళ్​ కార్యకర్తలకు సీపీ వేధింపులు'

కరీంనగర్ పోలీస్ కమిషనర్ పత్రికల్లో తప్పుడు ప్రకటనలిస్తూ తమ కార్యకర్తలను  భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని భజరంగ్​దళ్, విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది.

By

Published : Jun 26, 2019, 5:59 PM IST

'భజరంగ్​దళ్​ కార్యకర్తలకు సీపీ వేధింపులు'

చేయని తప్పులను ఒప్పుకోవాలని తమ కార్యకర్తలను కరీంనగర్ పోలీసు కమిషనర్ కమల్​హసన్​రెడ్డి విచక్షణా రహితంగా కొట్టాడని భజరంగ్​దళ్​​ ఆరోపించింది. ఈ నెలలోనే ఏడుగురిని హెడ్​ క్వార్టర్స్​కి పిలిపించి విచక్షణారహితంగా కొట్టినట్లు జోనల్​ కన్వీనర్ ప్రదీప్​​ కుమార్​ తెలిపారు. చెప్పినట్లు వినకపోతే రౌడీ షీట్​ ఓపెన్​ చేస్తానని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, అనవసరంగా జైల్లో పెట్టారని చెప్పారు. వేధింపులు ఇలాగే కొనసాగితే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

'భజరంగ్​దళ్​ కార్యకర్తలకు సీపీ వేధింపులు'

ABOUT THE AUTHOR

...view details