తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్వాపూర్​లో ఆటో దహనం.. కేసు నమోదు

కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆటోను దహనం చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.

By

Published : Jan 4, 2021, 12:08 PM IST

Unidentified persons set fire to an auto in Baswapur village in Bhiknoor zone of Kamareddy district
ఆటోను దగ్ధం చేసిన దుండగులు

కామారెడ్డి జిల్లా భిక్నూర్ ​ మండలం బస్వాపూర్​కు చెందిన గుజ్జరి రమేష్​ ఆటోను గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. సరిగ్గా వారంరోజుల క్రితం గ్రామంలో ఇలాగే దుండగులు మరొక ఆటోను తగలబెట్టడం గమనార్హం.

గ్రామంలో వరుసగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దుండగులను పట్టుకొని శిక్షించాలని బాధితులు, గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:కందిపంటకు నిప్పుపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

ABOUT THE AUTHOR

...view details