తెలంగాణ

telangana

ETV Bharat / state

చేపలు పడదామని వెళ్లాడు.. శవమై తేలాడు

చేపల వేటకని వెళ్లిన యువకుడు రెండు రోజుల తర్వాత చెరువులో శవమై తేలిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. మృతుడు సరంపల్లి గ్రామానికి చెందిన శివ(24)గా పోలీసులు గుర్తించారు.

By

Published : May 8, 2020, 3:05 PM IST

one young man died in drown in pond
చేపలు పడదామని వెళ్లాడు.. శవమై తేలాడు

కామారెడ్డి మండలం సరంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకని వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయాడు. సరంపల్లి గ్రామానికి చెందిన శివ అనే యువకుడు బుధవారం రాత్రి పట్టణంలోని పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లాడు. గురువారం ఉదయమైనా శివ ఇంటికి రాకపోవటం వల్ల కుటుంబసభ్యులు చెరువంతా గాలించగా.. ఎక్కడా కన్పించలేదు.

ఈరోజు ఉదయం శవం పైకి తేలగా... చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకుని మృతదేహం శివదేనని గుర్తించారు. కుటుంబసభ్యులకు ఈ విషయం తెలియజేశారు. పంచనామా నిర్వహించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చూడండి:భోపాల్​ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్​ లీక్​లెన్నో...

ABOUT THE AUTHOR

...view details