తెలంగాణ

telangana

ETV Bharat / state

తల్లి మరణం... కుమార్తెకు 'పరీక్ష'

కంటి రెప్పలా పెంచిన మాతృమూర్తి దూరమైందనే బాధ ఓ వైపు.. పరీక్ష కాలం మరో వైపు. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదనే వేదన. అలాంటి తరుణంలో తల్లి చనిపోయిన బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ ఆ అమ్మాయి పరీక్షకు హాజరైంది. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

By

Published : May 20, 2022, 2:31 PM IST

రేణుక
రేణుక

పుట్టెడు దుఃఖంలో పరీక్షకు హాజరైంది ఓ ఇంటర్ విద్యార్థిని. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఈ విషాదకర ఘటన జరిగింది. బిచ్కుందకు చెందిన రేణుక ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాస్తోంది. చివరి పరీక్ష రోజే ఆమె తల్లి గంగమణి అనారోగ్యంతో మృతి చెందింది. ఇంట్లో తల్లి మృతదేహం ఉండగానే తప్పనిసరి పరిస్థితిలో పరీక్ష రాసింది.

పరీక్ష కేంద్రంలో రేణుక

తల్లి చనిపోయిన బాధ ఓ వైపు.. పరీక్ష మరోవైపు ఎటూ తేల్చుకోలేక పోయిన సందర్భంలో బంధువులు ధైర్యం చెప్పి పరీక్షకు పంపించారు. తల్లి చనిపోయిన బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ ఆమె పరీక్ష రాసింది. పరీక్ష ముగిసిన వెంటనే వెళ్లి తల్లి అంత్యక్రియల్లో రేణుక పాల్గొంది.

ABOUT THE AUTHOR

...view details