తెలంగాణ

telangana

By

Published : May 10, 2021, 2:18 PM IST

Updated : May 10, 2021, 3:10 PM IST

ETV Bharat / state

సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు.. అంబులెన్సులకు నో ఎంట్రీ

రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఏపీ నుంచి వచ్చే కరోనా బాధితులను అనుమతించడం లేదు. కొవిడ్ రోగులతో ఉన్న అంబులెన్సులను నిలిపివేస్తున్నారు. హైదరాబాద్‌లో పడకలు, ఆక్సిజన్ కొరత వల్లే ఈ చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు.

telangana police not allow covid patients, police inspections
సరిహద్దులో పోలీసుల తనిఖీలు, కొవిడ్ బాధితులను అడ్డుకున్న పోలీసులు

కరోనా రోగులతో వచ్చే అంబులెన్స్‌లకు పోలీసులు అనుమతించడం లేదు. జోగులాంబ గద్వాల్ జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేసి నిలిపివేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. కొవిడ్‌ రోగులతో వస్తున్న అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారు. కొవిడ్ రోగుల బంధువులు ఈ తనిఖీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో వాహనాలను ఆపేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సరిహద్దుల్లో అంబులెన్సులకు నో ఎంట్రీ

హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ లేకపోవడంతో కరోనా బాధితులను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర వాహనాలను అనుమతిస్తున్నారు. కడప జిల్లా మైదుకూరు నుంచి హైదరాబాద్​లోని ఎల్బీ నగర్‌కు వెళ్తున్న అంబులెన్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రిలో బెడ్​ ఉందని చెప్పినా వినలేదు. 2 గంటలు ప్రాధేయపడ్డ అనుమతించలేదు. బాధితుడి పరిస్థితి తీవ్రంగా ఉండడం వల్ల కర్నూలుకు తిరిగి వెళ్లిపోయారు.

ఇదీ చదవండి:ఏపీ నుంచి వచ్చే కొవిడ్ రోగులను అనుమతించని పోలీసులు

Last Updated : May 10, 2021, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details