తెలంగాణ

telangana

ETV Bharat / state

30 రోజుల్లో సమస్యల్ని పరిష్కరించాలి

నెలరోజుల గ్రామ పంచాయతీ ప్రణాళిక కార్యక్రమంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు.

By

Published : Sep 6, 2019, 8:26 PM IST

30 రోజుల్లో సమస్యల్ని పరిష్కరించాలి

గ్రామాల్లో 30 రోజుల్లో సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శశాంక సూచించారు. జిల్లాలోని వీరాపురం గ్రామాన్ని పాలనాధికారి సందర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో సమస్యలన్నింటినీ నెల రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామంలో పెండింగ్​లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం గ్రామంలో కలియతిరిగారు. గ్రామంలో కలెక్టర్ మొక్కలను నాటారు.

సమస్యల్ని పరిష్కరించాలి

ABOUT THE AUTHOR

...view details