లాక్డౌన్ సమయంలో పేదలకు సహాయం చేయడానికి రాజకీయాలు అవసరం లేదని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలం నెల్లుట్లలో మహారాష్ట్ర నుంచి వచ్చి ఇటుక బట్టీలలో పని చేస్తూ ఇక్కడే ఉండిపోయిన వలస కూలీలకు కడియం శ్రీహరి నిత్యావసర వస్తువులను అందజేశారు. కరోనా మహమ్మారి నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలని సూచించారు.
వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కడియం శ్రీహరి
జనగామ జిల్లా నెల్లుట్లలో మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలకు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ నివారణకు మాస్కులను ధరించాలని సూచించారు.
వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కడియం శ్రీహరి