తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్ ప్రకటనతో గ్రామస్థుల హర్షం

నిజామాబాద్​ సభలో కేసీఆర్​ ఇచ్చిన హామీతో ఆ గ్రామ ప్రజలు సంతోషంలో మునిగితేలుతున్నారు. జగిత్యాల జిల్లాలో ఒడ్డెలింగాపూర్​ గ్రామాన్ని మండలంగా మార్చుతానని ముఖ్యమంత్రి ప్రకటించారు.

By

Published : Mar 20, 2019, 8:42 AM IST

మండలంగా మారనున్న ఒడ్డెలింగాపూర్

మండలంగా మారనున్న ఒడ్డెలింగాపూర్
జగిత్యాల జిల్లా రాయికల్​ మండలం ఒడ్డె లింగాపూర్ గ్రామాన్ని మండలం కేంద్రంగా మార్చుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ సభలో ప్రకటించారు. సీఎం ప్రకటనతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఒడ్డె లింగాపూర్ మండల కేంద్రంగా మారితే దాని పరిధిలో 12 గిరిజన గ్రామాలకు మేలు జరుగుతుంది. రాయికల్​లో 32 గ్రామాలు ఉండగా మొత్తం 60 వేల మంది జనాభా ఉన్నారు. ఒడ్డెలింగాపూర్ 30 వేల మంది జనాభాతో నూతన మండలం ఏర్పాటు కానుంది. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా గిరిజన గ్రామాలు ఉన్న మండలంగా నిలువనుంది.

ABOUT THE AUTHOR

...view details