తెలంగాణ

telangana

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: సబ్​ కలెక్టర్​ గౌతమ్​

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని పురపాలక సంఘంలో ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మెట్​పల్లి సబ్​ కలెక్టర్​ గౌతమ్​ ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి అవగాహన కల్పించారు.

By

Published : Jan 7, 2020, 1:16 PM IST

Published : Jan 7, 2020, 1:16 PM IST

Elections should be held smoothly: Sub-Collector Gautam
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: సబ్​ కలెక్టర్​ గౌతమ్​

పురపాలక ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ అధికారులు ఎన్నికల కోసం పూర్తి కసరత్తులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలక సంఘంలో అధికారులు ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మెట్​పల్లి సబ్​ కలెక్టర్ గౌతమ్ ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. నిబంధనలు పాటిస్తూ.. ఎన్నికలు సజావుగా నిర్వహించాలని వారికి సూచించారు.

అనంతరం అధికారులు ఎన్నికల నియమావళి పుస్తకాన్ని సిబ్బందికి అందించారు. అందులోని నియమ నిబంధనలను పరిశీలించుకుని.. విధులు నిర్వహించాలని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్లు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని సబ్​కలెక్టర్​ వారిని ఆదేశించారు.

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: సబ్​ కలెక్టర్​ గౌతమ్​

ఇదీ చదవండి:కడు పేదరికంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details