తెలంగాణ

telangana

By

Published : Mar 25, 2020, 11:54 PM IST

ETV Bharat / state

కరోనా ప్రభావం... బోసిపోయిన ఆలయాలు

ఏటా ఉగాది పర్వదినాన భక్తులతో సందడిగా ఉండే దేవాలయాలు... కరోనా భయంతో భక్తులు రాక జగిత్యాల జిల్లాలోని ఆలయాలన్ని బోసిపోయాయి.

corona effect on temples in jagityal metpally district
కరోనా ప్రభావం... బోసిపోయిన ఆలయాలు

ఏటా ఉగాది వచ్చిందంటే భక్తిభావంతో, భక్తి పాటలతో సందడిగా ఉండే ఆలయాలు కరోనా ప్రభావం, లాక్‌డౌన్‌ నేపథ్యంలో భక్తుల రాకపోవడం వల్ల దేవాలయ ప్రాంగణాలన్ని బోసిపోయాయి. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో వాసవి మాత మురళీకృష్ణ చెన్నకేశవ స్వామి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులు లేక వెలవెలబోయింది.

ఏటా ఉగాది వచ్చిందంటే ఈ ఆలయాలు భక్తిభావంతో, భక్తి పాటలతో సందడిగా ఉండేవి. ప్రతి రోజు భక్తులతో కిటకిటలాడే దేవాలయాలు... ప్రస్తుతం తాళాలతో కనిపిస్తున్నాయి. పట్టణంలోని శివాలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది.

కరోనా ప్రభావం... బోసిపోయిన ఆలయాలు

ఇదీ చూడండి:రూ.2కే కిలో గోధుమలు- ఒప్పంద ఉద్యోగులకు వేతనం

ABOUT THE AUTHOR

...view details