తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్​లో స్వయం సహాయ బృందాలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ప్రారంభమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్​రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. పథకం ద్వారా 90 లక్షలకుపైగా మహిళల ఖాతాల్లోకి రూ.1,400 కోట్లు జమ కానున్నాయి. 8.78 లక్షల పొదుపు సంఘాల ఖాతాల్లో ఒకేసారి వడ్డీ సొమ్ము జమ కానుంది.

By

Published : Apr 24, 2020, 3:33 PM IST

ఏపీలో వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ప్రారంభం
ఏపీలో వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ప్రారంభం

ఏపీ స్వయం సహాయక బృందాలకు ఆర్థికసాయమందించే లక్ష్యంతో తీసుకొచ్చిన వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్నిఆ రాష్ట్ర సీఎం జగన్‌ మోహన్​ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం ప్రారంభించిన ఈ పథకం ద్వారా... 90 లక్షల 37 వేల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. వారి ఖాతాల్లోకి రూ. 1,400 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది.

8 లక్షల 78 వేల పొదుపు సంఘాల ఖాతాల్లో ఒకేసారి వడ్డీ సొమ్ము జమ కానుంది. సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే సహాయక సంఘాల ఖాతాల్లో నగదు వేయనున్నారు.

ఇదీ చూడండి:సీఎంఆర్​ఎఫ్​కు పెళ్లి ఖర్చులు.. వరుడికి కేటీఆర్ ప్రశంసలు

ABOUT THE AUTHOR

...view details