తెలంగాణ

telangana

By

Published : Mar 31, 2021, 7:07 PM IST

ETV Bharat / state

ప్రజా ప్రతినిధుల కోర్టుకు షర్మిళ, విజయమ్మ హాజరు

పరకాల ఎన్నికల ప్రచారం కేసులో.. వైఎస్ షర్మిళ, విజయమ్మ ప్రజా ప్రతినిధుల కోర్టులో హాజరయ్యారు. తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేశారు.

Court of Public Representatives
ప్రజా ప్రతినిధుల కోర్టులో షర్మిళ, వైఎస్ విజయమ్మ

పరకాల ఎన్నికల ప్రచారం కేసు విచారణ కోసం ప్రజా ప్రతినిధుల కోర్టులో షర్మిళ, వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న కొండా సురేఖ, కొండా మురళీ కూడా హాజరయ్యారు.

వీరి నలుగురిపై న్యాయస్థానం అభియోగాలు నమోదు చేసింది. నిందితులందరూ వారిపై మోపిన అభియోగాలను తోసిపుచ్చారు. వాదనల కోసం విచారణను ఏప్రిల్ 8కి ప్రజా ప్రతినిధుల కోర్టు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:భాజపాయేతర పార్టీలకు మమత లేఖ

ABOUT THE AUTHOR

...view details