తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగరం వేదికగా అంతర్జాతీయ డిజైనర్ ఎక్స్​పో

భాగ్యనగరం వేదికగా అంతర్జాతీయ డిజైనర్ ఎక్స్​పోలో హైదరాబాద్​ నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి వివిధ రకాల డిజైనర్లు ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు.

By

Published : Jul 19, 2019, 10:48 PM IST

అంతర్జాతీయ డిజైనర్ ఎక్స్​పో

అంతర్జాతీయ డిజైనర్ ఎక్స్​పోకి భాగ్యనగరం వేదిక కానుంది. ఈ ఏడాది అక్టోబర్​లో వరల్డ్ డిజైనర్స్ 31వ ఎడిషన్​కి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటి వరకు భారత్​లో ఈ ప్రదర్శన జరగటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేశ్​ రంజన్, గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో రాజీవ్ చిలక, ఎన్​ఐడీ అహ్మదాబాద్ డైరెక్టర్ ప్రవీణ్ నహర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వరల్డ్ డిజైనర్స్ 31వ ఎడిషన్​లో భాగంగా హైదరాబాద్ డిజైనర్ వీక్ పేరుతో అక్టోబర్ 9 నుంచి 13వరకు నిర్వహించనున్నారని జయేశ్​ రంజన్ తెలిపారు. ఈ ప్రదర్శనలో హైదరాబాద్ నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి వివిధ రకాల డిజైనర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్టు పేర్కొన్నారు.

అంతర్జాతీయ డిజైనర్ ఎక్స్​పో

ABOUT THE AUTHOR

...view details