తెలంగాణ

telangana

ETV Bharat / state

అందరినీ విచారిస్తాం...

జయరామ్​ హత్యకేసుతో విచారణ కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి వాగ్మూలానికి సాక్ష్యాల సేకరణలో పోలీసులు ఉన్నారు. రేపు నందిగామ వెళ్లి విచారణ చేయనున్నారు.

By

Published : Feb 18, 2019, 5:42 PM IST

సాక్ష్యాల సేకరణలో పోలీసులు

జయరాం హత్య కేసులో రాకేశ్‌రెడ్డికి సహకరించిన వారు, సలహాలు ఇచ్చిన వారిని విచారిస్తామని బంజారాహిల్స్ డీసీపీ ఏ.ఆర్​.శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి పాత్ర ఉన్నట్లు తేలితే చర్యలు తప్పవన్నారు. జయరామ్‌తో నగదు లావాదేవీలు జరిగినట్లు రాకేశ్‌ చెబుతున్నాడని.. ఆ నగదు ఎలా వచ్చిందనే విషయాలు సరిగ్గా చెప్పట్లేదన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 55 మందిని విచారించినట్లు తెలిపారు. కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులను కూడా విచారిస్తామని డీసీపీ పేర్కొన్నారు.

సాక్ష్యాల సేకరణలో పోలీసులు

ABOUT THE AUTHOR

...view details