తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాహుల్ ప్రధానమంత్రి కావడమే మన లక్ష్యం'

రాష్ట్రంలో జరిగే పార్లమెంటు ఎన్నికలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ జరిపారు. ఎన్నికల్లో ఏ ప్రణాళికతో ముందుకు సాగాలో దిశానిర్దేశం చేశారు.

By

Published : Feb 12, 2019, 5:09 PM IST

కాంగ్రెస్ నేతలకు ఫోన్ ద్వారా దిశానిర్దేశం చేస్తున్న ఉత్తమ్

కాంగ్రెస్ నేతలకు ఫోన్ ద్వారా దిశానిర్దేశం చేస్తున్న ఉత్తమ్
డీసీసీ, మండల కాంగ్రెస్ అధ్యక్షులతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరుకు వస్తున్నందున కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ నెల 14 వరకు ఎంపీ అభ్యర్థులుగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
భాజపా వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి అందరూ కృషి చేయాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details