తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్ ​టెన్​ న్యూస్ ​@9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

By

Published : Jan 18, 2021, 8:55 PM IST

top ten news for 9pm
ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1.మేడిగడ్డకు సీఎం

ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. మేడిగడ్డ ఆనకట్ట వద్ద నీటిమట్టం వంద అడుగులకు చేరుకున్న నేపథ్యంలో సీఎం ప్రాజెక్ట్​ను పరిశీలించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

2.ఆవిష్కరణ

బయో ఆసియా సదస్సు పోస్టర్, వెబ్ సైట్, థీమ్​ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్​లో​ ఆవిష్కరించారు. లైఫ్ సైన్సెస్ ఈవెంట్స్​లో అతిపెద్ద ప్రదర్శన బయో ఆసియా సదస్సును కొవిడ్ నేపథ్యంలో వర్చువల్​గా నిర్వహించనున్నట్లు బయో ఆసియా నిర్వహణ కమిటీ ప్రకటించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

3.జైలుకు పంపుతాం

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘన స్వాగతం లభించింది. డివిజన్ పరిధిలోని చేవెళ్ల, షాబాద్, శంకర్​పల్లి, మొయినాబాద్ మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి బండి సంజయ్​కి ఆహ్వానం పలికారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

4.జాప్యం చేసేందుకే

అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి ఓటుకు నోటు కేసు రాదన్న తన పిటిషన్​పై మళ్లీ వాదనలు వినాలని కోరుతూ... రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​పై అనిశా కౌంటరు దాఖలు చేసింది. రేవంత్ రెడ్డి అభ్యర్థనపై ఏసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

5.వేడుకలు రద్దు

రిపబ్లిక్​ డే (జనవరి 26) రోజున భారత్​- పాక్​ సరిహద్దు అయిన వాఘా వద్ద ఎలాంటి వేడుకలు ఉండవని బీఎస్ఎఫ్ వర్గాల వెల్లడించాయి. కరోనా వ్యాప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

6.పోలీసులదే తుది నిర్ణయం

జనవరి 26న రైతులు తల పెట్టిన ట్రాక్టర్​ ర్యాలీకి సంబంధించి నిర్ణయాధికారం దిల్లీ పోలీసులదేనని సుప్రీంకోర్టు తెలిపింది. శాంతి భద్రతలకు సంబధించిన విషయంలో ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ వారికుందని పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

7.ఆవేదన

టీకా పంపిణీలలో అసమానతలపై డబ్ల్యూహెచ్​ఓ ఆవేదన వ్యక్తం చేసింది. ఓ పేద దేశానికి 25 డోసులు మాత్రమే అందాయని, అదే సమయంలో 50 ధనిక దేశాల్లో 3.9 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయని తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

8.నష్టాలు

అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల నడుమ సోమవారం స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 470 పాయింట్లు కోల్పోయి.. 48,564 వద్దకు చేరింది. నిఫ్టీ 152 పాయింట్లు తగ్గి..14,281 వద్ద స్థిరపడింది.పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

9.పిచ్​ మహిమ

చివరి టెస్టు ఆఖరి రోజున తమ బౌలర్లు సహనంగా ఉండాలని సూచించాడు ఆసీస్ స్టార్ బ్యాట్స్​మన్ స్టీవ్ స్మిత్. గబ్బా పిచ్ అనుకోని రీతిలో స్పందిస్తోందని చెప్పాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

10.మీ ఇష్టం

సూపర్​ స్టార్​ రాజకీయ రంగ ప్రవేశంపై నిరాశ చెందిన అభిమాన సంఘం నేతలు వేరే పార్టీలో చేరుతున్న నేపథ్యంలో రజనీ మక్కల్​ మండ్రం ఓ కీలక ప్రకటన చేసింది. అభిమానులు వారి ఇష్టాలకు అనుగుణంగా ఏ పార్టీలో అయినా చేరవచ్చని తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details