తెలంగాణ

telangana

ETV Bharat / state

గోల్కొండ కోటలో దొంగలు...!

తమ రాజ్యాన్ని శత్రువుల దాడుల నుంచి కాపాడుకునేందుకు నిజాంలు కట్టుకున్న గోల్కొండ కోటలోనే దొంగలు పడ్డారు. అమ్మవారి ఆలయంలోని సొత్తు కాజేసేందుకు యత్నించారు...!

By

Published : Feb 5, 2019, 4:30 PM IST

ఆలయంలో చోరీకి విఫలయత్నం

ఆలయంలో చోరీకి విఫలయత్నం
హైదరాబాద్‌ గోల్కొండ కోటలోని అమ్మవారి గుడిలో దొంగతనానికి విఫలయత్నం జరిగింది. ఈ ఘటన ఆదివారం రాత్రి జరగ్గా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. హుండీని పగలగొట్టేందుకు ప్రయత్నించగా... సాధ్యం కాకపోవటంతో వెనుదిరిగారు.
సోమవారం ఉదయాన పూజారి వచ్చినప్పుడు ఈ విషయం తెలిసింది. వెంటనే గోల్కొండ పీఎస్​కు సమాచారమందించాడు. అగంతుకులు ఘటనాస్థలంలోనే వదిలేసి వెళ్లిన పనిముట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details