Special trains to sabarimala: శబరిమలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సికింద్రాబాద్- కొల్లామ్, కొల్లామ్- సికింద్రాబాద్, కాచిగూడ-కొల్లామ్, కొల్లామ్- కాచిగూడ, నాందేడ్- కొల్లామ్, తిరుపతి- కొల్లామ్, తిరుపతి- నాందేడ్ల మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని ద.మ. రైల్వే తెలిపింది. అయ్యప్ప భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
Special trains to sabarimala: శబరిమల యాత్రికులకు గుడ్ న్యూస్.. ఆ తేదీల్లో ప్రత్యేక రైళ్లు
Special trains to sabarimala: అయ్యప్ప స్వాముల శబరిమల యాత్ర దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే.. ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. భక్తుల కోసం ఈ నెలలో 9 రోజులపాటు ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ప్రకటించింది.
![Special trains to sabarimala: శబరిమల యాత్రికులకు గుడ్ న్యూస్.. ఆ తేదీల్లో ప్రత్యేక రైళ్లు Special trains to sabarimala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13872294-693-13872294-1639144906093.jpg)
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
కార్తికమాసం వచ్చిందంటే అయ్యప్ప భక్తుల యాత్రలు మొదలవుతాయి. తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో అయ్యప్ప స్వామి మాలధారులు శబరిమలకు పయణమవుతుంటారు. వారి సౌకర్యార్థం.. దక్షిణ మధ్య రైల్వే శబరిమలకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.