రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్.... వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజ్ భవన్లో జరిగిన సమీక్షలో డెంగీ నివారణ, స్వైన్ ఫ్లూ రాకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలు సహా వైద్య రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి, ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ యోగితా రాణి... నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గవర్నర్ సమీక్ష
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ సహా.. .రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం కోసం అమలు చేస్తున్న పథకాలపై సమీక్ష నిర్వహించినట్లు గవర్నర్ తమిళి సై ట్విట్టర్లో తెలిపారు.
![వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గవర్నర్ సమీక్ష telangana governor review on Health Department](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5280948-120-5280948-1575554562104.jpg)
telangana governor review on Health Department
వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గవర్నర్ సమీక్ష
ఇవీ చూడండి:దిశ సెల్ఫోన్ను గుర్తించిన పోలీసులు
Last Updated : Dec 5, 2019, 8:15 PM IST