తెలంగాణ

telangana

By

Published : Jul 5, 2019, 3:11 PM IST

ETV Bharat / state

అనాథల ఆశాదీపం సెయింట్ థెరిసా ఇకలేరు

ఎంతో మంది అనాథ పిల్లలను ఆదరించిన ఆత్మీయురాలు ఇకలేరు. స్వచ్ఛంద సంస్థలో అనేకమందిని చేరదీసి సేవలందించిన సెయింట్ థెరిసా మరణించారు.

టెండర్ లవింగ్ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సెయింట్ థెరిసా మరణించారు

అనాధ పిల్లలను ఆదరించి స్వచ్ఛంద సంస్థలో చేరదీసిన టెండర్ లవింగ్ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సెయింట్ థెరిసా(87) గురువారం అర్ధరాత్రి స్థానిక ఎర్రగడ్డలోని చర్చి హాస్పిటల్​లో అనారోగ్యంతో మరణించారు. థెరిసా కేరళ రాష్ట్రం కులంలో పుట్టి, ఈ సంస్థలో నన్​గా చేరింది. నర్సుగా అనేక ఆసుపత్రులలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

కులమతాలకు అతీతంగా ఆప్యాయంగా పేద పిల్లలను చేరదీశారని ఫౌండేషన్ సభ్యులు గుర్తు చేసుకున్నారు. ఆంధ్ర తెలంగాణతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో థెరిసా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. అదేవిధంగా అనాథ పిల్లలను దత్తత తీసుకొని అంకిత భావంతో పిల్లల కొరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు.

టెండర్ లవింగ్ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సెయింట్ థెరిసా మరణించారు

ఇదీ చూడండి : నాగుపాముల సయ్యాట చూస్తారా..!

ABOUT THE AUTHOR

...view details