తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇదేం న్యాయం... ప్లకార్డు పట్టుకుంటేనే అరెస్టు చేస్తారా: రేవంత్​

కాంగ్రెస్ కార్యకర్త సాయిబాబా అరెస్ట్‌పై కమిషనర్‌తో ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ప్లకార్డు పట్టుకుంటే అరెస్టు చేయడమేంటని సీపీని రేవంత్​ ప్రశ్నించారు. కేసును పరిశీలించి వదిలేస్తామని సీపీ... రేవంత్​కు తెలిపారు.

By

Published : Jul 9, 2020, 7:21 PM IST

Updated : Jul 9, 2020, 8:09 PM IST

revanth reddy phone hyderabad cp anjanikumar on congress leader arrest
ప్లకార్డు పట్టుకుంటే అరెస్టు చేయడం దారుణం: ఎంపీ రేవంత్​

ప్లకార్డులు పట్టుకుంటే అరెస్టు చేయడం దారుణమని మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్త సాయిబాబా అరెస్టు విషయంలో ఆయన నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్​తో ఫోన్‌లో మాట్లాడారు. నిన్న రాత్రి నుంచి స్టేషన్‌లో ఎందుకు ఉంచారని, కేసు నమోదు చేసి పంపాలని కదా అని సీపీని ప్రశ్నించారు. కేసును పరిశీలించి వదిలేస్తామని రేవంత్‌కు సీపీ తెలిపారు.

అంతకు ముందు పంజాగుట్ట ఏసీపీకి, ఇన్‌స్పెక్టర్​కు ఫోన్ చేస్తే ఏసీపీ ఫోన్ లిప్ట్‌ చేయలేదని... తాను సెలవులో ఉన్నానని ఇన్‌స్పెక్టర్ సమాధానం ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో ఆరోగ్య అత్యయిక పరిస్థితి ప్రకటించాలి: బండి సంజయ్‌

Last Updated : Jul 9, 2020, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details