తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్ ఇమేజ్ తగ్గిపోయింది: రేవంత్

మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రేవంత్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉదయపు నడకకు వచ్చేవారిని కలిసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

By

Published : Mar 25, 2019, 9:57 AM IST

రేవంత్ ప్రచారం

రేవంత్ ప్రచారం
మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి కూకట్​పల్లి ఐడియల్ చెరువు కట్టపై వాకర్స్​ను కలిసి ప్రచారం నిర్వహించారు. ఉదయపు నడకకు వచ్చిన వారిని ఓట్లు అభ్యర్థించారు. గతంలో తెరాసకు 16 పార్లమెంటు స్థానాలు ఉన్నా... తెలంగాణ అభివృద్ధికి చేసిందేమి లేదని వ్యాఖ్యానించారు. తెరాస పాలనలో నగర ఇమేజ్ తగ్గిపోయిందని ఆరోపించారు. నగర స్థాయి పెరగాలంటే పార్లమెంట్​లో పోరాడే నాయకుడిని గెలిపించాలన్నారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే మల్కాజిగిరి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details