తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో పోలింగ్​ 8 గంటల నుంచి ప్రారంభం

రాష్ట్రంలో అందరి చూపు నిజామాబాద్​ నియోజకవర్గంవైపే... అక్కడ లోక్​సభ స్థానానికి 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీనికోసం ప్రత్యేకఏర్పాట్లు చేశారు ఎన్నికల సంఘం అధికారులు.

By

Published : Apr 7, 2019, 3:49 PM IST

నిజామాబాద్​లో పోలింగ్​ 8 గంటల నుంచి ప్రారంభం

నిజామాబాద్​ లోక్​సభ పరిధిలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​ నిర్వహించనున్నట్లు సీఈవో రజత్​కుమార్​ తెలిపారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మాక్​ పోలింగ్​ జరుపుతామన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై రైతు అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. కర్షకుల అనుమానాలు పూర్తి స్థాయిలో నివృత్తి చేశామని తెలిపారు. నిజామాబాద్​కు ఒక హెలికాప్టర్​తో పాటు.. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక హెలిప్యాడ్​ ఏర్పాటు చేశామని వివరించారు. ఎన్నికల విధులకు ఎవరు ఆటంకం కలిగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

నిజామాబాద్​లో పోలింగ్​ 8 గంటల నుంచి ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details