తెలంగాణ

telangana

డేంజర్.. గాంధీ ఆవరణలో పీపీఈ కిట్ల గుట్ట

సికింద్రాబాద్​ గాంధీ ఆస్పత్రి ఆవరణలో వాడిపడేసిన పీపీఈ కిట్లు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. వీటి నుంచి వచ్చే దుర్వాసనతో సమీప ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

By

Published : Aug 3, 2020, 3:26 PM IST

Published : Aug 3, 2020, 3:26 PM IST

గాంధీ ఆవరణలో గుట్టల్లా పేరుకున్న పీపీఈ కిట్లను తొలగించరెందుకు ?
గాంధీ ఆవరణలో గుట్టల్లా పేరుకున్న పీపీఈ కిట్లను తొలగించరెందుకు ?

వైద్యులు, సిబ్బంది, రోగులు వాడిపడేసిన పీపీఈ కిట్లు గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుట్టల్లా పేరుకుపోతున్నాయి. వాటి నుంచి వచ్చే దుర్వాసనతో సమీపంలోని పద్మారావునగర్ వాసులు విలవిల్లాడుతున్నారు. కొందరు ఇళ్లను సైతం ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. వాటి వల్ల తమకూ కరోనా సోకుతుందేమోనని బెంబెలెత్తిపోతున్నారు. వైద్య సిబ్బందితో పాటు రోగులూ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో నెలకొన్నాయి.

గాంధీలో 1000కి పైగా కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్న తరుణంలో పెద్ద ఎత్తున పీపీఈ కిట్ల వాడకం పెరిగింది. రోగులు, వైద్యులు, నర్సులు, వార్డుల్లో పని చేసేవారు ఉపయోగించిన కిట్లు రోజుకు 2 వేలకు పైగానే ఉంటున్నాయి.

ఏరోజుకారోజు తీసుకెళ్లాల్సి ఉన్నా...

సుమారు నెలకు 60 వేల కిట్లు చెత్తకుండీలో వేస్తున్నారు. ఆస్పత్రి ఆవరణలోని ఓ చిన్న రేకుల గది వద్ద వాడి పడేసిన కిట్లను ఉంచుతున్నారు. వాడి పడేసిన పీపీఈ కిట్లను రాంకీ సంస్థ సిబ్బంది ఏ రోజుకారోజు తీసుకెళ్లాల్సి ఉన్నప్పటికీ నెల రోజులుగా పట్టించుకోవట్లేదు. ఈ విషయంపై ఆస్పత్రి సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వాడి పడేసిన కిట్లను గాంధీ ఆసుపత్రి పరిసరాల నుంచి తొలగించాలని వైద్యులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చూడండి : భూ క్రమబద్ధీకరణ ఆదాయంతో పట్టణాల అభివృద్ధి

ABOUT THE AUTHOR

...view details