కుల వృత్తులపై ఆధారపడి జీవించే కార్మికులు లాక్డౌన్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. దాతలు, ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
'కుల వృత్తులపై ఆధారపడిన వారిని ఆదుకోండి'
కుల వృత్తులపై ఆధారపడిన కార్మికులను ఆదుకోవడానికి దాతలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ కోరారు.
mla muta gopal distributed groceries to needy in musheerabad
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గ విశ్వకర్మ సంఘం నేత శ్రీధర్ చారి ఆధ్వర్యంలో 200 మంది విశ్వకర్మ కుటుంబాలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.