తెలంగాణ

telangana

By

Published : May 15, 2020, 2:56 PM IST

ETV Bharat / state

'కుల వృత్తులపై ఆధారపడిన వారిని ఆదుకోండి'

కుల వృత్తులపై ఆధారపడిన కార్మికులను ఆదుకోవడానికి దాతలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ కోరారు.

mla muta gopal distributed groceries to needy in musheerabad
mla muta gopal distributed groceries to needy in musheerabad

కుల వృత్తులపై ఆధారపడి జీవించే కార్మికులు లాక్​డౌన్​తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్​ అన్నారు. దాతలు, ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్​ ముషీరాబాద్​ నియోజకవర్గ విశ్వకర్మ సంఘం నేత శ్రీధర్ చారి ఆధ్వర్యంలో 200 మంది విశ్వకర్మ కుటుంబాలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్​ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధనలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details