తెలంగాణ

telangana

ETV Bharat / state

AndhraPradesh: హైకోర్టు పరిధిలో మూడు రాజధానుల అంశం: కేంద్ర హోంశాఖ

ఏపీలో మూడు రాజధానుల అంశంపై కేంద్ర హోం శాఖ సమాధానమిచ్చింది. రాజధానుల అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని తెలిపింది.

By

Published : Jul 13, 2021, 11:20 PM IST

AndhraPradesh
కేంద్ర హోంశాఖ, రాజధాని

ఆంధ్రప్రదేశ్​ మూడు రాజధానుల అంశంపై సమాచార హక్కు చట్టం ద్వారా చేసిన దరఖాస్తులకు కేంద్ర హోం శాఖ సమాధానమిచ్చింది. 3 రాజధానుల అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని తెలిపింది. హైకోర్టులో విచారణలో ఉన్నందున సమాచారమివ్వడం కుదరదని వెల్లడించింది. దరఖాస్తును అప్పిలేట్‌ అథారిటీకి పంపుతున్నట్టు తెలిపింది.

గత ప్రభుత్వ హయాంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించిన విషయం తెలిసిందే. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు.

ఇదీ చదవండి:కౌశిక్​ రెడ్డి మరో ఆడియో లీక్​... అందులో ఏముందంటే!

ABOUT THE AUTHOR

...view details