తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​

మహిళలకు రక్షణ పరంగానూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ పేర్కొన్నారు. హైదరాబాద్​ మధురా నగర్​లో జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే గోపినాథ్​ నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆటపాటల్లో పాల్గొన్న మహిళలకు అజయ్​ కుమార్​ బహుమతులు అందజేశారు.​

మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​
మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​

By

Published : Mar 13, 2020, 11:45 PM IST

మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​

మహిళలకు అన్ని రంగాల్లో నే కాకుండా రక్షణ పరంగా కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ వెంగల్​ రావు నగర్​ డివిజన్​ మధురా నగర్​లో మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​ ఆధ్వర్యంలో నిర్వహించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళలకు మంత్రి బహుమతులు అందజేశారు.

మహిళా శక్తి లేని ప్రపంచం లేదని.. అతివలకు భరోసా ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి పువ్వాడ అభిప్రాయపడ్డారు. మహిళా దినోత్సవం ఒక్క రోజులో జరుపుకోవడం కాదని.. తమ నియోజకవర్గాల్లో సుమారు వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details