తెలంగాణ

telangana

ETV Bharat / state

'లాక్​డౌన్​ కఠినంగా అమలు..అనవసరంగా బయటకు రావొద్దు'

హైదరాబాద్​లో పాతబస్తీ నగరాన్ని పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సందర్శించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను డ్రోన్ కెమెరా సాయంతో వీక్షించారు. మే 7 వరకు లాక్​డౌన్​కు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

Lockdown tightly in hyderabad Don't come out unnecessary
'లాక్​డౌన్​ కఠినంగా అమలు..అనవసరంగా బయటకు రావొద్దు'

By

Published : Apr 21, 2020, 2:59 PM IST

లాక్​డౌన్​ దృష్ట్యా హైదరాబాద్ పాతబస్తీ నగరంలో పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పర్యటించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను డ్రోన్ కెమెరా సాయంతో పరిశీలించారు. లాక్​డౌన్ సందర్భంగా పాసులు కేవలం ఆహార వస్తువులు, నిత్యావసరాల తరలింపుకు మాత్రమే ఇచ్చామన్నారు. వాటిని దుర్వినియగం చేస్తే కేసు నమోదు చేసి వారి వాహనాలను జప్తు చేస్తామన్నారు.

ఉదయం నుంచి అడిషనల్ సీపీలు, డీసీపీలు విధుల్లో ఉంటున్నారని వెల్లడించారు. డెలివరీ అయిన మహిళను ఆమె ఇంటి వద్ద దింపేందుకు బయలుదేరిన 102 వాహనాన్ని మదీనా చౌరస్తా వద్ద ఛార్మినార్ ట్రాఫిక్ పోలీసులు ఆపారు. మీడియా ప్రతినిధుల జోక్యంతో అంబులెన్స్​ని పంపించారు.

'లాక్​డౌన్​ కఠినంగా అమలు..అనవసరంగా బయటకు రావొద్దు'

ఇదీ చూడండి :మాస్క్‌లు లేవు... ఆరోగ్య పరీక్షలు కానరావు

ABOUT THE AUTHOR

...view details