తెలంగాణ

telangana

ETV Bharat / state

రయ్..రయ్..

ఎల్.బి.నగర్ జంక్షన్​లో ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. ఫ్లై ఓవర్ ప్రారంభంతో వాహనదారులు రయ్ రయ్​మని దూసుకెళ్తున్నారు.

By

Published : Mar 1, 2019, 8:09 AM IST

Updated : Mar 1, 2019, 9:58 AM IST

ప్రారంభానికి సిద్ధమైన ఫ్లైఓవర్​

హైదరాబాద్​లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎస్ఆర్​డీపీ ఫలాలు ఒక్కొక్కటి గా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఫ్లై ఓవర్స్ , అండర్ పాసులు అందుబాటు లోకి రాగా.. అత్యంత రద్దీగా ఉండే ఎల్.బి.నగర్ జంక్షన్​లో ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్​అలీ, తలసాని, నగర మేయర్ బొంతు రామ్మోహన్​హాజరుకానున్నారు.
సాఫీగా ప్రయాణం..
ఒక కిలోమీటర్ పొడవునా ఎల్.బి.నగర్ ప్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. రూ.42 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఈ ప్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల దిల్​సుఖ్​నగర్​ నుంచి విజయవాడ హైవే వరకు ప్రయాణం సులువవుతుంది. ఎల్.బి.నగర్ రింగ్ రోడ్డు సిగ్నల్ నుంచి ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా బండి ముందుకు సాఫీగా సాగిపోతుంది. దీనివల్ల సమయం ఆదా కావటంతోపాటు , పెట్రోల్ ఖర్చు మిగులుతుంది
సుమారు రూ.448కోట్లకు కోట్లతో ఎల్.బి.నగర్​లో ఐదు జంక్షన్లను అభివృద్ది చేశారు. ఇప్పటికే చింతలకుంట అండర్ పాస్, కామినేని ప్లైఓవర్​లు అందుబాటులోకి వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్​లో రూ. 23వేల కోట్లతో ఎస్ఆర్​డీపి పనులు నగరంలోని పలు రద్దీ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: 'ఆధార్​ 'గుర్తింపు''

Last Updated : Mar 1, 2019, 9:58 AM IST

ABOUT THE AUTHOR

...view details