హైదరాబాద్లోని ఎస్సాఆర్డీపీ పనుల పురోగతి, జంక్షన్ల అభివృద్ధి, ఫుట్పాత్ల ఆక్రమణల తొలగింపు అంశాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చర్చించారు. ట్రాఫిక్ సిగ్నల్స్, బస్షెల్టర్ల మరమ్మతులు, ఫుట్ఓవర్ బ్రిడ్జిల పనుల గురించి సమీక్షించారు.
కూడళ్లు, ఫుట్పాత్లపై మంత్రి కేటీఆర్ సమీక్ష
భాగ్యనగరంలో ఎస్ఆర్డీపీ పనుల పురోగతి, జంక్షన్ల అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు అధికారులతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్షించారు.
భాగ్యనగర సమస్యలపై కేటీఆర్ సమీక్ష
ఈ సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్లు, పలు విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షకు ముందు కేటీఆర్ను మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కలిశారు.
ఇదీ చూడండి: హింసకు సంకెళ్లేద్దాం... 'ఆమె'ను స్వేచ్ఛగా ఎగరనిద్దాం!
Last Updated : Nov 25, 2019, 3:22 PM IST