తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రగతి భవన్‌లో ముఖ్య నేతలతో కేసీఆర్​ భేటీ

కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తామంటున్న గులాబీ అధినేత రాష్ట్రంలో 16 స్థానాలు కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. గెలుపుగుర్రాల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

By

Published : Mar 20, 2019, 9:30 PM IST

తుది జాబితాపై కసరత్తు...

తెరాస పార్లమెంటు అభ్యర్థుల ఖరారు చేసేందుకు గులాబీ అధినేత కసరత్తు ముమ్మరం చేశారు. ప్రగతి భవన్‌లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్​ సమావేశమయ్యారు. మహబూబాబాద్, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ తదితర నియోజకవర్గాలపై భేటీలో చర్చించారు. లోక్‌సభ అభ్యర్థులను రేపు ప్రకటించనున్నట్లు ప్రకటించిన దృష్ట్యా ఈ భేటీ కీలకంగా మారింది.

ప్రచార బాధ్యతలు...
మరోవైపు ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టిన కేసీఆర్​... ఇప్పటికే పలు నియోజకవర్గాల ప్రచారాన్ని తామే చూసుకోవాలంటూ అభ్యర్థులకు సూచించారు. దాంతోపాటుగా మహబూబాబాద్ ఎన్నికల ఇన్‌ఛార్జీగా సత్యవతి రాథోడ్‌, వరంగల్‌, మహబూబాబాద్ ప్రచార పర్యవేక్షణ బాధ్యతలను మంత్రి ఎర్రబెల్లికి అప్పగించారు.

ఇవీ చూడండి:'తెరాసకు ఓటేస్తే తెలంగాణ సమాజానికి లాభం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details