తెలంగాణ

telangana

ETV Bharat / state

అలరించిన కామెర్సియో ఎస్సిఎన్‌ఎ ఎక్స్‌ఫో

విల్లామేరీ కళాశాల విద్యార్థులు కామెర్సియో ఎస్సి.ఎన్.ఎ ఎక్స్​ఫోను ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది.

By

Published : Feb 2, 2019, 11:55 PM IST

ఆకట్టుకున్న విల్లామేరి విద్యార్థులు

ఆకట్టుకున్న విల్లామేరి విద్యార్థులు
సోమాజిగూడ విల్లామేరీ కళాశాల విద్యార్థులు జయ గార్డన్‌లో ఏర్పాటు చేసిన కామెర్సియో ఎస్సిఎన్‌ఎ ఎక్స్‌ఫో అందరిని ఆకట్టుకుంది. విద్యార్థులు నృత్యాలు, నటనలతో తమ ప్రతిభను కనబరిచారు.
ట్రెడ్​ ఫెయిర్​ ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రదర్శనలో మొత్తం 40 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఎక్స్​ఫోను నిజామాబాద్​ ఎంపీ కవిత ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఎక్స్​ఫోలో వాణిజ్యరంగంలో ఎలా రాణించాలనే అంశాలపై అవగాహన కల్పించారు.ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని ఎంపీ కవిత అన్నారు.
కామెర్సియో ఎస్సిఎన్‌ఎ ఎక్స్‌ఫో రెండ్రోజుల పాటు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్‌, ఆయన సతీమణి రుచి రంజన్‌, ఐపీఎస్‌ అధికారి అరుణ బహుగుణ, విల్లామేరీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఫిలేమినా పాల్గొన్నారు. .

ABOUT THE AUTHOR

...view details