తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలిక ఆత్మహత్య

అమీర్​పేటలో విషాదం చోటుచేసుకుంది. తరచూ చరవాణిలో గేమ్స్ ఆడుతున్న కూతురిని తల్లి మందలించటం వల్ల ఆరో అంతస్తు నుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకుంది.

By

Published : Mar 17, 2019, 10:02 AM IST

బాలిక ఆత్మహత్య

బాలిక ఆత్మహత్య
చరవాణి చూడొద్దని తల్లి మందలించిందని మనస్తాపం చెందిన ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. అమీర్‌పేటలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లోగల ఎవరెస్ట్‌ బ్లాక్‌లో నివసిస్తున్న మాధవికి ఇద్దరు పిల్లలు. ఆమె భర్త అమెరికాలో పనిచేస్తూ నాలుగేళ్ల కిందట అక్కడే మృతి చెందారు. అప్పటి నుంచి మాధవి తండ్రి వద్ద ఉంటూ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. కుమార్తె సంహిత స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. పరీక్షల సమయంలో ఎక్కువ సేపు చరవాణి వాడొద్దని, చదువుకోవాలని తల్లి మందలించింది. మనస్తాపానికి గురైన బాలిక శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆరో అంతస్తు పైనుంచి దూకింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:తల్లిదండ్రులకు భారం కాకూడదని ఆత్మహత్య


ABOUT THE AUTHOR

...view details