తెలంగాణ

telangana

ETV Bharat / state

గణేశ్​నిమజ్జనానికి రానున్న ఆరెస్సెస్ అధినేత

హైదరాబాద్​లో జరగనున్న గణేశ్ నిమజ్జనానికి ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్, ప్రాగ్యానంద్​ మహరాజ్​ వస్తున్నట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ తెలిపింది.

By

Published : Sep 10, 2019, 6:52 AM IST

Updated : Sep 10, 2019, 8:00 AM IST

నిమజ్జనానికి రానున్న ఆరెస్సెస్ అధినేత

హైదరాబాద్​లో జరిగే గణేష్‌ నిమజ్జనానికి ఆరెస్సెస్ అధ్యక్షుడు మోహన్‌ భగవత్‌, హరిద్వార్​కు చెందిన ప్రాగ్యానంద్​ మహరాజ్​ హాజరవుతున్నట్లు భాగ్యనగర్ గణేశ్​ ఉత్సవ సమితి కార్యదర్శి భగవంత్ ​రావు తెలిపారు. ఇరువురు నేతలు ఇచ్చే సందేశాన్ని ప్రజల అందరూ వీక్షించే విధంగా నగరంలో 12 ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు​ బాహేతి భవన్‌లో సామూహిక గణేశ్​ నిమజ్జన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. సీపీ అంజనీ కుమార్, రవాణా శాఖ సంయుక్త కమిషనర్‌ పాండురంగ నాయక్​తో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిమజ్జనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. తమ శాఖ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టినట్లు రవాణాశాఖ సంయుక్త కమిషనర్ పాండురంగ నాయక్ వివరించారు.

నిమజ్జనానికి రానున్న ఆరెస్సెస్ అధినేత
ఇదీచూడండి: 1984 అల్లర్లు: కమల్​నాథ్​ను వీడని చిక్కులు!
Last Updated : Sep 10, 2019, 8:00 AM IST

ABOUT THE AUTHOR

...view details