తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతన్నకు 'రుణాల' భారం

రుణాలు మంజూరులో కెనరా బ్యాంకు అక్రమాలకు పాల్పడిందంటూ రైతులు ఆందోళనకు దిగారు. తెజస అధ్యక్షుడు కోదండరాం, మహిళా సంఘాల నేతలు మద్దతు పలికారు.

By

Published : Mar 18, 2019, 1:30 PM IST

ఆందోళన చేస్తున్న రైతులు

ఆందోళన చేస్తున్న రైతులు
హైదర్​గూడలోని కెనరా బ్యాంకు రుణాలు ఇవ్వడంలో మోసాలకు పాల్పడిందని రైతులు ధర్నాకు దిగారు. పాలిహౌజ్​నిర్మాణం కోసం రైతులకు కేంద్ర పభుత్వం 50% రాయితీ ఇస్తుంది. రుణం కోసం దాఖలు చేసుకున్న రైతులకు మంజూరైన, ఆ సొమ్ము వేరే వ్యక్తుల ఖాతాల్లో బ్యాంకు అధికారులు జమ చేశారని ఆరోపించారు. వీరి అక్రమాలపై రిజర్వు బ్యాంకు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు తెజస అధ్యక్షుడు కోదండరాం మద్దతు పలికారు.

ABOUT THE AUTHOR

...view details