తెలంగాణ

telangana

ETV Bharat / state

బోయిన్​పల్లిలో ఘనంగా తెరాస ఆవిర్భావ వేడుకలు

సికింద్రాబాద్​ బోయిన్​పల్లిలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు  జరిగాయి. కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పార్టీ జెండా ఎగురవేశారు. పార్లమెంట్​ ఫలితాల్లో తెరాస ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

By

Published : Apr 27, 2019, 10:55 AM IST

బోయిన్​పల్లిలో ఘనంగా తెరాస ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోయిన్​పల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జెండా ఎగురవేశారు. పార్టీ కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ, స్వీట్లు పంచుతూ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అసెంబ్లీలో గెలిచినట్లుగానే రాబోయే పార్లమెంట్ ఫలితాల్లోనూ 16 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

బోయిన్​పల్లిలో ఘనంగా తెరాస ఆవిర్భావ వేడుకలు

ఇవీ చూడండి:'రాహుల్ 'దేశద్రోహం కేసు'​ పిటిషన్​పై నివేదిక ఇవ్వండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details