తెలంగాణ

telangana

ETV Bharat / state

మరో రోజు దోస్త్‌ గడువు పొడిగింపు

డిగ్రీ ఆన్​లైన్​ సర్వీసెస్​ తెలంగాణ ద్వారా అభ్యర్థులు కళాశాలల్లో చేరేందుకు నిన్నటికే గడువు ముగినప్పటికీ... మరో రోజు గడువు పొడిగించినట్లు దోస్త్​ కన్వీనర్​ ఆచార్య లింబాద్రి తెలిపారు.

By

Published : Jul 6, 2019, 5:18 AM IST

Updated : Jul 6, 2019, 7:32 AM IST

మరో రోజు దోస్త్‌ గడువు పొడిగింపు

దోస్త్​( డిగ్రీ ఆన్​లైన్​ సర్విసెస్​ తెలంగాణ) ద్వారా అభ్యర్థులు కళాశాలల్లో చేరేందుకు మరో రోజు గడువు పొడిగించారు. నిన్నటికే గడువు ముగిసినప్పటికీ... ఇవాళా కూడా చేరే అవకాశం కల్పిస్తున్నట్లు దోస్త్​ కన్వీనర్ ఆచార్య​ లింబాద్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు లక్ష 18వేల 415 మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరారు. ఇంటర్​ అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీ ఫలితాల అనంతరం జరిగే ప్రత్యేక విడతలో... ఇప్పటివరకు దోస్త్​లో రిజిస్టర్​ చేసుకోని వారితో పాటు... నమోదు చేసుకున్నప్పటికీ వెబ్​ఆప్షన్లు ఇవ్వని వారికి, సీటు దక్కని వారికే అవకాశం ఉంటుందని తెలిపారు.

మరో రోజు దోస్త్‌ గడువు పొడిగింపు

సీటు వచ్చినప్పటికీ కళశాలలో చేరని వారి వివరాలు దోస్త్​ నుంచి తొలగిస్తామని.. అలాంటి వారు ప్రత్యేక విడతలో పాల్గొనాలంటే 400 రూపాయలు చెల్లించి మళ్లీ నమోదు చేసుకోవాల్సిందేనని కన్వీనర్​ తెలిపారు. కాలేజీల్లో చేరిన వారు మరింత మంచి కళాశాలల్లో సీటు కావాలనుకుంటే... ఇప్పటికే ఇచ్చిన ఐచ్ఛికాలను పరిగణనలోకి తీసుకుంటామని... తాజాగా వెబ్​ఆప్షన్లు ఇవ్వడం కుదరదని వివరించారు.

ఇదీ చూడండి: హరేన్​ పాండ్య హత్యకేసులో 12 మందికి శిక్ష

Last Updated : Jul 6, 2019, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details