తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫీవర్ ఆస్పత్రి వద్ద 200 పేద కుటుంబాలకు సరుకుల పంపిణీ

కరోనా లాక్​డౌన్ వల్ల నిరుపేదల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య కార్మికులకు అంబర్​పేట నియోజకవర్గ బాధ్యులు తెదేపా సీనియర్ నేత ప్రవీణ్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

By

Published : May 6, 2020, 9:12 PM IST

200 పేద కుటుంబాలకు సరుకుల పంపిణీ
200 పేద కుటుంబాలకు సరుకుల పంపిణీ

హైదరాబాద్ అంబర్​పేట నియోజకవర్గం పరిధి నల్లకుంట డివిజన్​లో ఫీవర్ ఆస్పత్రి వద్ద 200 మంది జీహెచ్ఎంసీ కార్మికులకు తెదేపా సీనియర్ నేత ప్రవీణ్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు దేశంలోనే అత్యధిక మిగులు బడ్జెట్​తో నిలిచిన తెలంగాణలో నేడు ప్రజలు అన్నమో రామచంద్ర అనే దుస్థితికి సీఎం కేసీఆర్ తెచ్చారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం పంపించే బియ్యం ప్రజలెవరూ తినడానికి పనికి రాని స్థితిలో పురుగులు పట్టి ఉన్నాయని విమర్శించారు.

'మీరైనా 3 పూటలా భోజనం పెట్టించాలి'

లాక్​డౌన్ అమలుకు ముందు నగర వాసులు తమ కష్టార్జీతంతో మంచి బియ్యం, పప్పులు కొనుక్కొని తిన్నారని స్పష్టం చేశారు. సాయం అందించే చోట తెరాస కార్యకర్తలు పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్​ నగరంలో పేదల ఆకలి గుర్తించి... వారికి మూడు పూటలా భోజనం అందించే ఏర్పాట్లు చేయాలని మంత్రి కేటీఆర్​ను కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇవీ చూడండి : సీఎంకు కృతజ్ఞతలు చెబుతూ మందుబాబు ఆనందం

ABOUT THE AUTHOR

...view details