తెలంగాణ

telangana

ETV Bharat / state

కిరోసిన్​ సీసాలతో కాంట్రాక్టర్ల ధర్నా

తమ బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని జీవీపీఆర్ కార్యాలయం​ ముందు కిరోసిన్​ పోసుకుని ఆత్మహత్యాయ్నానికి  ప్రయత్నించారు. అక్కడే పోలీసులు వారిని అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు.

By

Published : Jul 9, 2019, 6:59 PM IST

ధర్నా చేస్తున్న కాంట్రాక్టర్లు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జీవీపీఆర్ కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బిల్లులు చెల్లించపోతే తమకు చావే శరణ్యమంటూ కుటుంబసభ్యులతో కలిసి కిరోసిన్ సిసాలతో ఆందోళనకు దిగారు. ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం వల్ల వారిని పోలీసులు అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు. పెన్‌పహాడ్ మండలం అనంతారం, సూర్యాపేట మండలం కుసుమవారి గూడెం గ్రామాల్లో 40కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు ట్యాంకులను ఆనందరావు, శంకర్‌రావు అనే ఇద్దరు కాంట్రాక్టర్లు జీవీపీఆర్ కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్టుగా తీసుకుని నిర్మించారు. రెండు ట్యాంకులకు కలిపి కోటి 26 లక్షల బిల్లు కాగా ఇప్పటి వరకు 80లక్షలు మాత్రమే చెల్లించారని బాధితులు తెలిపారు. ఇంకా 46లక్షలు చెల్లించాలని 18 నెలలుగా జీవీపీఆర్, మిషన్ భగీరథ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా బిల్లులు చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భార్యల మెడలో ఉన్న పుస్తెల తాళ్లు అమ్మి గడువులోగా వాటర్ ట్యాంకులు నిర్మించామన్నారు.

బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్ల ధర్నా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details