తెలంగాణ

telangana

ETV Bharat / state

actor dilip kumar: 'దిలీప్​కుమార్‌కు భారతరత్న ఇవ్వాలి'

ట్రాజెడీ కింగ్​ దిలీప్​కుమార్​కు భారతరత్న ఇవ్వాలని ప్రముఖ పాత్రికేయుడు అలీ సిద్దికీ కుమారుడు డాక్టర్​ కబీర్​ సిద్దిఖీ అన్నారు. దిలీప్​కుమార్​ ఉర్దూ భాషకు ఎనలేని సేవ చేశారని పేర్కొన్నారు. ఆయనకు భారత అత్యున్నత పురష్కారం ఇవ్వాలని కబీర్​ సిద్దికీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

By

Published : Jul 9, 2021, 5:00 PM IST

DILIP KUMAR
DILIP KUMAR

ప్రముఖ బాలీవుడ్​ నటుడు దిలీప్​కుమార్​ మృతి పట్ల ప్రముఖ ఉర్దూ పాత్రికేయుడు అలీ సిద్దిఖీ కుమారుడు డాక్టర్​ కబీర్​ సిద్దికీ విచారం వ్యక్తం చేశారు. దిలీప్​కుమార్​ లేనిలోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

నటుడు దిలీప్​ కుమార్​తో..

1984లో దిల్లీలో జరిగిన మొట్టమొదటి ఉర్దూ సమావేశాన్ని నటుడు దిలీప్​కుమార్​ ప్రారంభించి.. ఉర్దూలోనే ప్రసంగించారని గుర్తు చేసుకున్నారు. ఆయనకు హైదరాబాద్​తో ఎనలేని అనుబంధం ఉందని.. భాగ్యనగరంలో జరిగిన అనేక కవిత పఠణాల్లో దిలీప్​ కుమార్​ పాల్గొన్నారని తెలిపారు.

మరచిపోలేని గురుతులు

నటుడిగానే కాకుండా రాజకీయ, విద్య, సంక్షేమ కార్యక్రమాల్లో దిలీప్​కుమార్​ చురుగ్గా ఉండేవారని సిద్దిఖీ పేర్కొన్నారు. దిలీప్​కుమార్​ మృతి పట్ల అలీ సిద్దిఖీ భార్య సబ్రీ సుల్తానా విచారం వ్యక్తం చేశారు. దిలీప్​ ఎప్పుడు హైదరాబాద్​ వచ్చినా తమ ఇంటికి వచ్చే వారని.. తన భర్తకు మంచి మిత్రుడని పేర్కొన్నారు.

DILIP KUMAR

గత కొంతకాలం నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న దిలీప్​ కుమార్​ ముంబయి హిందూజ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస(Dilip Kumar Died) విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ తారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాంటాక్రూజ్​ ముంబయిలోని జుహు కబ్రాస్థాన్​లో బుధవారం సాయంత్రం 5 గంటలకు దిలీప్​ కుమార్​కు అంత్రక్రియలు నిర్వహించారు.

ఇదీ చూడండి:Dilip Kumar: బాలీవుడ్​ దిగ్గజ నటుడు దిలీప్​ కుమార్​ కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details